Video : వైట్ జెర్సీలు ధరించి మైదానానికి చేరుకున్న కోహ్లీ ఫ్యాన్స్.. కరుణించని వరణుడు..!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు ఆర్సీబీ, కోల్కతా మధ్య మ్యాచ్ జరగనుంది
By Medi Samrat
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు ఆర్సీబీ, కోల్కతా మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమవుతోంది. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.25 గంటలకు మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రీడాకారులు, మ్యాచ్ అధికారులతో పాటు స్టేడియంలో ఉన్న ప్రజలందరూ భారత సైన్యాన్ని గౌరవిస్తూ జాతీయ గీతాన్ని ఆలపిస్తారని IPL అధికారిక ప్రసారకర్త తెలిపారు. అయితే.. చిన్నస్వామిలో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. మైదానం కవర్లతో కప్పబడి ఉంది. ఇదిలావుంటే.. విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే నేటి మ్యాచ్లో అభిమానులు అతడి గౌరవార్ధం టెస్ట్ జెర్సీతో మైదానానికి చేరుకున్నారు.
To Virat, with LOVE! 🤍
— Star Sports (@StarSportsIndia) May 17, 2025
A lovely gesture by the fans in Bengaluru, donning white jerseys to pay tribute to Virat Kohli's incredible Test journey! 👑
Watch the LIVE action ➡ https://t.co/r4DtdEw2gv#IPLonJioStar 👉 RCB 🆚 KKR | LIVE NOW on Star Sports-1, Star Sports-1 Hindi,… pic.twitter.com/AhDrlXxBAV
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ ఒక వారం వాయిదా వేయబడింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐపీఎల్ సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. అనంతరం నేడు RCB, KKR మధ్య మ్యాచ్తో IPL 2025 మిగిలిన సీజన్ ప్రారంభమవుతుంది.
అద్భుతమైన ఫామ్లో ఉన్న కోహ్లి తన టెస్టు కెరీర్ను ఆకస్మికంగా ముగించిన తర్వాత బ్యాటింగ్తో కూడా కొన్ని ఆకట్టుకునే ఇన్నింగ్స్లు ఆడాలనుకుంటున్నాడు. ప్రస్తుత సీజన్లో KKR బ్యాట్స్మెన్ ఎక్కువగా నిరాశపరిచారు. కెప్టెన్ అజింక్యా రహానే, యువ ఆంగ్క్రిష్ రఘువంశీ మినహా మరే బ్యాట్స్మెన్ నిలకడను ప్రదర్శించలేదు. అయితే ఈ మ్యాచ్లో అందరి దృష్టి కోహ్లిపైనే ఉంటుంది. స్టేడియంలో కూడా ప్రేక్షకులు ఆయన పేరును ఎక్కువగా జపిస్తారు. ఈ వెటరన్ బ్యాట్స్మెన్ ఈ వారం ప్రారంభంలో టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలను చూస్తుంటే.. సాంప్రదాయక ఫార్మాట్కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఈ బ్యాట్స్మెన్ను గౌరవించేందుకు అభిమానులు తెల్లటి జెర్సీని ధరించి స్టేడియానికి రావాలని ప్లాన్ చేశారు.
అయితే, గాయం కారణంగా దేవదత్ పడిక్కల్, ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ ఆర్బీబీలో లేకపోవడం పెద్ద సమస్య కావచ్చు. పడిక్కల్ స్థానంలో వచ్చిన మయాంక్ అగర్వాల్ ను సద్వినియోగం చేసుకోవాలని RCB భావిస్తోంది. హాజిల్వుడ్కు భుజం గాయం ఉంది. అతడు ఆడటం గురించి ఫ్రాంచైజీ ఇంకా తెలియజేయలేదు.