ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు.. ఫాలో అవుతూ.. అనుచితంగా తాకిన మోటార్‌సైకిలిస్ట్

ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులను గురువారం ఉదయం ఓ మోటార్‌సైకిలిస్ట్ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

By -  Medi Samrat
Published on : 26 Oct 2025 8:58 AM IST

ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు.. ఫాలో అవుతూ.. అనుచితంగా తాకిన మోటార్‌సైకిలిస్ట్

ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులను గురువారం ఉదయం ఓ మోటార్‌సైకిలిస్ట్ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ త‌ర్వాత‌ రెండు రోజుల పాటు ఆటగాళ్లకు విశ్రాంతి దొర‌క‌డంతో జట్టు హోటల్ సమీపంలోని ఒక కేఫ్‌కు వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటారుసైకిలిస్ట్ వారిని ఫాలో అయ్యాడు. ఈ క్ర‌మంలోనే ఆటగాళ్ళలో ఒకరిని అనుచితంగా తాకాడు.

దీంతో వారిద్దరూ తమ టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ డానీ సిమన్స్‌ని సంప్రదించారు. సిమన్స్‌ స్థానిక అధికారులతో సమన్వయం చేసుకున్నారు. పోలీసు సిబ్బంది సహాయం కోసం వెంట‌నే ఒక వాహనాన్ని పంపారు. ఆగంతకుడి వాహనం నంబర్‌ను గుర్తించి. నిందితుడిని అరెస్టు చేయడంలో సిమన్స్‌ పోలీసులకు సహాయం చేశాడు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌లు 74, 78 కింద కేసు నమోదు చేయబడింది.

ఈ పరిణామాన్ని ధృవీకరిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన విడుదల చేసింది: "ఇండోర్‌లోని ఒక కేఫ్‌కి వెళుతున్నప్పుడు ఆస్ట్రేలియన్ మహిళల జట్టులోని ఇద్దరు సభ్యులను మోటర్‌సైకిలిస్ట్ సంప్రదించి అనుచితంగా తాకినట్లు CA ధృవీకరించగలదు. ఈ విషయాన్ని టీమ్ సెక్యూరిటీ పోలీసులకు నివేదించింది, వారు ఈ విషయాన్ని విచారిస్తున్నారు.

PTI నివేదిక ప్రకారం.. ఖజ్రానా రోడ్ ప్రాంతంలో జరిగిన సంఘటన తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిమానీ మిశ్రా ఆటగాళ్లను కలుసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేశారు.

క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) లేదా ఆస్ట్రేలియన్ టీమ్ మేనేజ్‌మెంట్ దీనిని ఐసిసికి నివేదించలేదని తేలింది. "నగరంలో ఒంటరిగా తిర‌గ‌డానికి ఆటగాళ్లను బయటకు పంపేందుకు అనుమతించడం ద్వారా వారు ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారు. ఐసిసి, బిసిసిఐతో పాటు పోలీసు అరెస్టును నిర్ధారించింది" అని ఐసిసి ప్రతినిధి తెలిపారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) స్పందించింది. "ఒక దురదృష్టకర సంఘటన మా దృష్టికి వచ్చింది. ఆస్ట్రేలియన్ ఆటగాళ్ల ప‌ట్ల‌ ఒక దుష్టుడు అనుచితంగా ప్రవర్తించాడు. మేము ఈ విష‌యాన్ని పోలీసులకు నివేదించాము. అధికారులు నిందితుడిని కనిపెట్టారు. మేము విచారణకు సహకరిస్తున్నాము" అని MPCA అధికారి ఒకరు తెలిపారు. ఈరోజు ఇద్దరు ఆటగాళ్లు మైదానంలోకి రావడం మాకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

"ఇది చాలా ఖండించదగినది. విచ్చలవిడి సంఘటన. భారత్‌ ఆతిథ్యం, సంరక్షణకు ప్రసిద్ధి చెందింది. ఇలాంటి సంఘటనలను మేము సహించము. నిందితుడిని పట్టుకున్న‌ రాష్ట్ర పోలీసులు (మధ్యప్రదేశ్) చర్యను అభినందిస్తున్నాము. నేరస్థుడికి త‌గిన శిక్ష ప‌డుతుంది. అవసరమైతే మా భద్రతా ప్రోటోకాల్‌లను పునశ్చరణ చేస్తామని మేము హామీ ఇస్తున్నాము" అని బిసిసిఐ కార్యదర్శి దేవా అన్నారు.

Next Story