నాలుగో టెస్టు.. మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ కొద్దిసేప‌టి క్రితం ప్రారంభం అయ్యింది

By Medi Samrat
Published on : 23 July 2025 3:41 PM IST

నాలుగో టెస్టు.. మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ కొద్దిసేప‌టి క్రితం ప్రారంభం అయ్యింది. మాంచెస్టర్‌లో జ‌రుగుతున్న‌ ఈ మ్యాచ్ భారత జట్టుకు డూ ఆర్ డై. లార్డ్స్‌లో విజయం సాధించిన ఆతిథ్య జట్టు సిరీస్‌లో 1-2 ఆధిక్యంలో ఉంది. కాగా.. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగింది. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్ ద్వారా ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేస్తున్నాడు. దీప్దాస్ గుప్తా అతనికి టెస్ట్ క్యాప్ అందజేశారు. ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. దీంతో పాటు నితీష్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో లియామ్ డాసన్ తిరిగి వచ్చినట్లు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు.

భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్.

ఇంగ్లండ్: జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (సి), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.

Next Story