ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పవర్ప్లే ఓవర్లు చాలా ముఖ్యమైనవని, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉండటం వల్ల ఈ మ్యాచ్లలో తమ జట్టుకు అవకాశాలు పెరుగుతాయని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం అన్నారు. ఆస్ట్రేలియా దూకుడు ఆటతీరు ముందు బుమ్రా ఉండటం తమ జట్టుకు ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుందన్నాడు.
మ్యాచ్ ప్రారంభం సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. 'పవర్ప్లేలో బౌలింగ్ చేయడం ఎప్పుడూ సవాలే. వన్డే సిరీస్, టీ20 ప్రపంచకప్లో ఎలా ఆడాడో చూశాం. పవర్ప్లే ఎప్పుడూ ముఖ్యం. పవర్ప్లేలో కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేసే బాధ్యతను బుమ్రా తీసుకున్నాడని మీరు ఆసియా కప్లో చూసి ఉంటారు, కాబట్టి అతను ఆ బాధ్యతను నిర్వహించడం మాకు మంచి విషయం. ఆస్ట్రేలియన్ జట్టుపై పవర్ప్లేలో బౌలింగ్ చేయడం ఖచ్చితంగా మంచి సవాలుగా ఉంటుందన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్కు సన్నద్ధమవుతున్న తమ జట్టు దూకుడు ధోరణిని కొనసాగిస్తుందని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అన్నాడు. మంగళవారం మ్యాచ్కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో మార్ష్ మాట్లాడుతూ.. 'గత రెండు ప్రపంచ కప్లలో మేము ఆశించిన విజయాలు సాధించలేకపోయాము. ప్రపంచ కప్ను గెలవడానికి జట్టుగా మమ్మల్ని సవాలు చేయడం గురించి మాట్లాడామని నేను భావిస్తున్నాను' అని చెప్పాడు. బ్యాటింగ్ యూనిట్గా మేము చాలా దూకుడుగా ఆడాము. గత కొన్నేళ్లుగా టీ20 క్రికెట్లో చాలా జట్లు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయని నేను భావిస్తున్నాను. భారత్లో జరిగే ప్రపంచకప్ గురించి మాట్లాడితే.. కొన్ని సందర్భాల్లో విజయం సాధించకపోయినా కచ్చితంగా ఇలాగే ఆడతామన్నాడు.