చివరి మ్యాచ్‌లో రైజ్ అయిన హైదరాబాద్‌..కోల్‌కతాపై భారీ విజయం

ఐపీఎల్-2025 సీజన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ విక్టరీతో ముగించింది.

By Knakam Karthik
Published on : 26 May 2025 6:40 AM IST

Sports News, IPL-2025, Sunrisers Hyderabad, Kolkata Knight Riders

చివరి మ్యాచ్‌లో రైజ్ అయిన హైదరాబాద్‌..కోల్‌కతాపై భారీ విజయం

ఐపీఎల్-2025 సీజన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ విక్టరీతో ముగించింది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్ కతాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 110 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. హెన్రిచ్ క్లాసెస్ ఈ మ్యాచ్‌లో 105 పరుగులు చేశాడు. కేవలం 39 బంతుల్లో 9 సిక్సులు, 7 ఫోర్లు కొట్టి హైరాబాద్‌కు విజయాన్ని అందించాడు. దీంతో మూడు వికెట్లు కోల్పోయి హైదరాబాద్ 278 పరుగులు చేసింది. ఈ స్కోరును కేకేఆర్ ఛేదించలేకపోయింది. కేవలం 168 పరుగులకే కేకేఆర్ ఆల్ అవుట్ అయ్యింది. నరైన్31, మనీశ్ పాండే 37, రాణా 34 పురుగుల చేశారు. వీరు తప్ప మరెవరూ రాణించలేదు. ఇక సన్‌రైజర్స్ జట్టులో బౌలర్లు మలింగ , దూబే, ఉనద్కత్ ముగ్గురూ మూడు చొప్పున వికెట్లు తీసి కేకేఆర్‌ను ఓడించడంలో కీలకంగా వ్యవహరించారు.

ఓ దశలో 110 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ జట్టు స్కోరు ఇంతవరకు వచ్చిందంటే అది మనీష్ పాండే, హర్షిత్ రాణాల చలవే. భారీ షాట్లతో విజృంభించిన వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు 50 పరుగులు జోడించారు. అయితే మనీష్ పాండేను జయదేవ్ ఉనద్కట్ అవుట్ చేయడంతో కేకేఆర్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోల్ కతా ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

ఇక, ఇటీవల ఐపీఎల్-2025 పునఃప్రారంభమయ్యాక సన్ రైజర్స్ ఆట మామూలుగా లేదు. వరుసగా మూడు మ్యాచ్ ల్లో నెగ్గి తన ట్రేడ్ మార్క్ కు న్యాయం చేసింది. అయితే, ప్లే ఆఫ్ కు చేరలేకపోవడం ఒక్కటే లోటు. అయినప్పటికీ, అభిమానులకు అవసరమైన వినోదాన్ని అందించడంలో మాత్రం సన్ రైజర్స్ రూటే వేరు. ఇవాళ కూడా 250కి పైగా స్కోరు చేసి టీ20 క్రికెట్ కు సిసలైన అర్థం చెప్పింది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ పై సూపర్ విక్టరీతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి ఎగబాకడం విశేషం. సన్ రైజర్స్ జట్టు ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు, 7 ఓటములు నమోదు చేసింది. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.

Next Story