టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. భారతజట్టులోకి వారిద్దరి ఎంట్రీ

Srilanka Won Toss And Elected To Bat. ఎన్నో రోజుల తర్వాత భారత జట్టు లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ఆడటానికి సిద్ధమైంది. శ్రీలంక వేదికగా

By Medi Samrat  Published on  18 July 2021 9:25 AM GMT
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. భారతజట్టులోకి వారిద్దరి ఎంట్రీ

ఎన్నో రోజుల తర్వాత భారత జట్టు లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ఆడటానికి సిద్ధమైంది. శ్రీలంక వేదికగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అందులో భాగంగా మొదటి వన్డేలో తొలి వ‌న్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక‌. ఈ మ్యాచ్‌లో టీమిండియా త‌ర‌ఫున ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ వ‌న్డే అరంగేట్రం చేస్తున్నారు. టీ20ల్లో టీమ్ త‌ర‌ఫున తొలి మ్యాచ్ ఆడిన సూర్య‌కుమార్ యాద‌వ్‌, ఇషాన్ కిష‌న్‌ ఈ మ్యాచ్‌తో వ‌న్డేల్లో అడుగుపెట్ట‌నున్నారు. శ్రీలంక టీమ్ త‌రఫున భ‌నుక రాజ‌ప‌క్స అరంగేట్రం చేస్తున్నాడు.

శ్రీలంక (ప్లేయింగ్ ఎలెవన్): అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (డబ్ల్యూ), భానుకా రాజపక్సే, ధనంజయ డి సిల్వా, చరిత్ అసాలంకా, దాసున్ షానకా (సి), వనిండు హసరంగ, చమికా కరుణరత్నే, ఇసురు ఉదనా, సంధామఖంతన్

ఇండియా (ప్లేయింగ్ ఎలెవన్): శిఖర్ ధావన్ (సి), పృథ్వీ షా, ఇషాన్ కిషన్ (డబ్ల్యూ), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్


Next Story