వన్డే కెప్టెన్సీ చేప‌ట్టే విష‌యం గిల్‌కు ముందే తెలుసు.. ఏం జ‌రిగిందో చెప్పేశాడు..!

రోహిత్ శర్మ మాదిరిగానే డ్రెస్సింగ్ రూమ్‌లో శాంతిని కాపాడేందుకు ప్రయత్నిస్తానని భారత జట్టు కొత్తగా నియమితుడైన వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గురువారం చెప్పాడు

By -  Medi Samrat
Published on : 9 Oct 2025 2:51 PM IST

వన్డే కెప్టెన్సీ చేప‌ట్టే విష‌యం గిల్‌కు ముందే తెలుసు.. ఏం జ‌రిగిందో చెప్పేశాడు..!

రోహిత్ శర్మ మాదిరిగానే డ్రెస్సింగ్ రూమ్‌లో శాంతిని కాపాడేందుకు ప్రయత్నిస్తానని భారత జట్టు కొత్తగా నియమితుడైన వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గురువారం చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

25 ఏళ్ల గిల్, 'రోహిత్ భాయ్ సార‌ధ్యంలో ఉన్న‌టువంటి ప్రశాంతతను, స‌భ్యుల ప‌ట్ల‌ స్నేహాన్ని నేను కొన‌సాగించాలనుకుంటున్నాను' అని చెప్పాడు. అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 25 వరకు భారత్‌ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది.

ఇదిలావుంటే.. రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై శుభమాన్ గిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ వన్డే ఫార్మాట్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇద్దరు దిగ్గజాలు టీ20 ఇంటర్నేషనల్, టెస్టు ఫార్మాట్ల నుంచి రిటైరయ్యారు.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉండగా, రోహిత్ శర్మ ముంబైలో ఉన్నాడు. వీరిద్దరూ అక్టోబర్ 15న ఆస్ట్రేలియాకు వెళ్లే భారత జట్టులో చేరనున్నారు. గిల్ మాట్లాడుతూ.. 'రోహిత్-విరాట్ భారత్‌కు చాలా మ్యాచ్‌లు గెలిచారు. ఎంపిక చేసిన కొద్దిమందికి మంచి శైలి, చాలా అనుభవం ఉంది. మాకు అవి కావాలన్నాడు.

శుభ్‌మన్ గిల్ తాను వన్డే కెప్టెన్ కావడం గురించి మా్లాడుతూ.. తను గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు తర్వాత ఈ విషయాన్ని ప్రకటించామని గిల్ అన్నారు. అయితే ఆ విషయం నాకు కొంచెం ముందే తెలిసింది. భారత్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం అన్నాడు.

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో తనకున్న సంబంధాల గురించి శుభ్‌మన్ గిల్ చెప్పాడు. 'మా సంబంధం బాగుంది. మా సంభాషణలు ఆటగాళ్లు సురక్షితంగా ఎలా ఉండాలనే దానిపై ఉన్నాయి. అలాగే.. మేము ఫాస్ట్ బౌలర్ల సమూహాన్ని సిద్ధం చేయడం గురించి మాట్లాడుతామని వెల్ల‌డించాడు.

Next Story