మరో థ్రిల్లర్.. పంజాబ్‌ను వరించిన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏ మ్యాచ్ ను కూడా తక్కువగా అంచనా వేయకూడదు.

By Medi Samrat
Published on : 26 March 2025 6:55 AM IST

మరో థ్రిల్లర్.. పంజాబ్‌ను వరించిన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏ మ్యాచ్ ను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను 11 పరుగుల తేడాతో ఓడించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. అయ్యర్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు, శశాంక్ సింగ్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ నిర్దేశించిన 243 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ జట్టు 199/3తో లక్ష్యానికి దగ్గరైంది. ఆఖర్లో పంజాబ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడం, గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో 232 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. సాయి సుదర్శన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేయగా, కెప్టెన్ శుభమన్ గిల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేశారు.

Next Story