న్యూ చండీగఢ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన RCB ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 101 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ తరఫున మార్కస్ స్టెయినీస్ (27 పరుగులు) మాత్రమే అత్యధిక పరుగులు చేశాడు. ఇది కాకుండా ఒమర్జాయ్, ప్రభాసిమ్రాన్ 18 పరుగులు చొప్పున చేశారు. ఆర్సీబీ బౌలర్లలొ జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ చెరో మూడు వికెట్లు తీశారు.
అనంతర బ్యాటింగ్కు దిగిన RCB 10 ఓవర్లలో 106 పరుగులు చేసి జయకేతనం ఎగరవేసింది. దీంతో 9 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ IPL 2025 ఫైనల్కు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ను ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఫిల్ సాల్ట్ అజేయ అర్ధ సెంచరీ ఆడాడు.ఆర్సీబీ జట్టులో కోహ్లీ(12), మయాంక్(19), రజత్ పాటిధార్(15) పరుగులు చేశారు.