వన్డే కెప్టెన్సీ వివాదంపై స్పందించిన రోహిత్ శర్మ

Rohit Sharma on ODI captaincy. విరాట్ కోహ్లీని కావాలనే వన్డే కెప్టెన్సీ నుండి తీసేశారంటూ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది

By Medi Samrat  Published on  12 Dec 2021 4:58 PM GMT
వన్డే కెప్టెన్సీ వివాదంపై స్పందించిన రోహిత్ శర్మ

విరాట్ కోహ్లీని కావాలనే వన్డే కెప్టెన్సీ నుండి తీసేశారంటూ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఇలాంటి సమయంలో కొత్త వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ నుండి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడుతూ బయట రూమర్స్ ను ఏ మాత్రం పట్టించుకోనని.. తనపై ఉంచిన బాధ్యతల మీద మాత్రమే దృష్టి సారించానని స్పష్టం చేశాడు. రోహిత్‌ను వైట్ బాల్ కెప్టెన్‌గా చేయాలనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం విరాట్ కోహ్లీ అభిమానులకు కోపం తెప్పించింది.. అయితే T20I మరియు ODI జట్లకు ఇద్దరు వేర్వేరు ఆటగాళ్లు నాయకత్వం వహించాలని సెలక్టర్లు కోరుకోలేదు.

గత నెలలో యూఏఈలో జరిగిన ప్రపంచకప్ తర్వాత కోహ్లీ టీ20 సారథి పదవి నుంచి వైదొలిగినప్పటికీ వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని కోరుకున్నాడు. దీంతో ఇరు జట్లలో గందరగోళం ఏర్పడుతుందని సెలక్టర్లు భావించి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌కు కెప్టెన్సీని ఇవ్వాలని కోరారు. ఇక టెస్టు వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానే స్థానంలో నియమితుడయ్యాడు. రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో ఈ బాధ్యతలను స్వీకరించనున్నాడు.

"మీరు భారతదేశం కోసం క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఒత్తిడి ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. దాని గురించి చాలా మంది మాట్లాడతారు; అది సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుంది. నాకు, వ్యక్తిగతంగా, ఒక క్రికెటర్‌గా, నా పనిపై దృష్టి పెట్టడం ముఖ్యం. ప్రజలు ఏమి మాట్లాడుతున్నారో దానిపై దృష్టి పెట్టడం కాదు, ఎందుకంటే మీరు దానిని నియంత్రించలేరు. నేను ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. మరోసారి కూడా అదే చెప్తున్నాను " అని రోహిత్ bcci.tv లో చెప్పాడు.

"మేము ఉన్నత స్థాయి టోర్నమెంట్‌ను ఆడుతున్నప్పుడు, చాలా చర్చలు జరుగుతాయని జట్టు అర్థం చేసుకుంది. మన చేతిలో ఉన్న వాటిపై దృష్టి పెట్టడం మాకు చాలా ముఖ్యం. వెళ్లి మ్యాచ్ లను గెలవడం.. మీకు తెలిసిన విధంగా ఆడటం. కాబట్టి, బయట జరిగే చర్చలను పట్టించుకోము. మేము ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నామో అది చాలా ముఖ్యం. ఆటగాళ్ల మధ్య బలమైన బంధాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. అదే మేము కోరుకున్న లక్ష్యాన్ని సాధించడంలో మాకు సహాయపడుతుంది" అని రోహిత్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాలో డిసెంబర్ 26 నుంచి 3 టెస్టులు ఆడనున్న రోహిత్ టెస్టు వైస్ కెప్టెన్‌గా పని చేయనున్నారు. ఆ తర్వాత జనవరి 19 నుంచి జరిగే 3 మ్యాచ్‌ల సిరీస్‌లో అతను వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.


Next Story