Video : 'క్రికెటర్-ఎంపీ' ఎంగేజ్మెంట్.. ఇంటర్నెట్లో వీడియో వైరల్..!
భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ రింకూ సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ల నిశ్చితార్థం ఈరోజు జరిగింది.
By Medi Samrat
భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ రింకూ సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ల నిశ్చితార్థం ఈరోజు జరిగింది. లక్నోలోని హోటల్ ది సెంట్రమ్లో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అభిమానులతోపాటు భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు, పెద్ద పెద్ద నాయకులు రింకూ-ప్రియకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నిశ్చితార్థ వేడుకలో రింకూ సింగ్ స్టైలిష్ వైట్ షేర్వానీని ధరించి కనిపించాడు. దీనిని ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిద్ధం చేశారు. ప్రియా పింక్ లెహంగా ధరించి చాలా అందంగా దర్శనమిచ్చింది. రింకూ సింగ్ ప్రియ చేయి పట్టుకుని స్టేజి వైపు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో అరిజిత్ సింగ్ 'ఓ మహి..' పాట బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతోంది. రింకూ సింగ్, ప్రియా సరోజ్ సుమారు 2 సంవత్సరాల క్రితం కలుసుకున్నారు.
Cricketer Rinku Singh & SP MP Priya Saroj exchange rings today in a private ceremony
— Anshu Singh (@Anshujourno92) June 8, 2025
#News #RinkuSingh #PriyaSaroj #Engagement #Samajwadi #SP #India @samajwadiparty @PriyaSarojMP pic.twitter.com/MaIGYH3NEX
9 ఏప్రిల్ 2023న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్ వేసిన ఓవర్లో రింకూ సింగ్ ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్ను గెలిపించి వెలుగులోకి వచ్చాడు. ఆ మ్యాచ్లో చివరి 6 బంతుల్లో KKR విజయానికి 29 పరుగులు అవసరం.. రింకూ తన అద్భుత ప్రదర్శనలో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచ్ తర్వాత రింకూ జట్టులోని ఒక సీనియర్ వివాహానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ అతని స్నేహితురాలు ప్రియా సరోజ్కు పరిచయం చేసింది. దీని తరువాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సుమారు ఒకటిన్నర సంవత్సరాలు ఒకరినొకరు తెలుసుకొని అర్థం చేసుకున్న తరువాత వారు ఈ రోజు నిశ్చితార్థం చేసుకున్నారు.