క్రికెట్ లో ఆ కొత్త రూల్స్ అమలు చేయనున్న ఐసీసీ

USA- వెస్టిండీస్‌లో జరగనున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024తో ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఓవర్ల

By Medi Samrat  Published on  15 March 2024 3:45 PM GMT
క్రికెట్ లో ఆ కొత్త రూల్స్ అమలు చేయనున్న ఐసీసీ

USA- వెస్టిండీస్‌లో జరగనున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024తో ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఓవర్ల మధ్య స్టాప్-క్లాక్‌లను ఉపయోగించబోతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెలిపింది. T20 ప్రపంచ కప్ 2024 కోసం ICC ఆట పలు అంశాలకు అంగీకారం తెలిపింది. ఇందులో ముఖ్యంగా ఫైనల్, రెండు సెమీ-ఫైనల్‌లకు రిజర్వ్ డే ఉంటుంది. ICC వార్షిక బోర్డు సమావేశాల తర్వాత మార్చి 15న ఈ నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2024 నుండి వెస్టిండీస్, USAలో జరిగే ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024తో స్టాప్-క్లాక్ విధానాన్ని ప్రారంభించి అన్ని ODIలు, T20Iలలో శాశ్వతంగా అమలు చేయనున్నారు.

డిసెంబర్ 2023లో, ICC పురుషుల పరిమిత ఓవర్ల అంతర్జాతీయ మ్యాచ్‌లలో స్టాప్ క్లాక్‌ విధానాన్ని ట్రయల్ చేసింది. ఈ విధానం ద్వారా ప్రతి ODI మ్యాచ్‌లో దాదాపు 20 నిమిషాలు ఆదా అయినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (CEC) తేల్చింది. జూన్ 1, 2024 నుండి ప్రారంభమయ్యే అన్ని ODI, T20I మ్యాచ్‌లలో ఈ ఫీచర్ ను అమలు చేయనున్నారు. పురుషుల వైట్-బాల్ క్రికెట్‌లో స్టాప్ క్లాక్ నియమం ప్రకారం, ఫీల్డింగ్ జట్టు మునుపటి ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్లలోపు కొత్త ఓవర్‌ను ప్రారంభించాలి. 60 నుండి సున్నాకి కౌంట్ డౌన్ చేసే ఎలక్ట్రానిక్ గడియారం గ్రౌండ్‌లో చూపిస్తారు. గడియారం ఎప్పుడు ప్రారంభమవుతుందో నిర్ణయించడానికి మూడవ అంపైర్ బాధ్యత వహిస్తారు. ముందు ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తమ తర్వాతి ఓవర్‌లోని మొదటి బంతిని వేయడానికి ఫీల్డింగ్ టీమ్ విఫలమైతే రెండు హెచ్చరికలను జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా ఇలాగే సాగితే ఒక్కో సందర్భంలో ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు.

Next Story