విషాదంలో క్రీడాలోకం.. మాజీ రంజీ క్రికెటర్ కన్నుమూత
Ranji Pacer Rajesh Varma Passes Away. ముంబై రంజీ క్రికెట్ మాజీ ఆటగాడు రాజేష్ వర్మ ఆదివారం గుండెపోటుతో మరణించాడు.
By Medi Samrat Published on
24 April 2022 12:47 PM GMT

ముంబై రంజీ క్రికెట్ మాజీ ఆటగాడు రాజేష్ వర్మ ఆదివారం గుండెపోటుతో మరణించాడు. ముంబై 2006-2007 సీజన్లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది. ఆ సీజన్లో రాజేష్ వర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. 40 ఏళ్ల కుడిచేతి వాటం ఆటగాడు రాజేష్ వర్మ మరణాన్ని ముంబై మాజీ సహచరుడు భవీన్ ఠక్కర్ ధృవీకరించారు. రాజేష్ వర్మ ఏడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 2006-07లో రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో కీలక ఆటగాడు. అతను 2002-2003లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అతను 2008లో మహారాష్ట్రలోని బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్తో తన చివరి మ్యాచ్ ఆడాడు. రాజేష్ ఏడు మ్యాచ్ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. 11 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. రాజేష్ వర్మ మృతి పట్ల క్రికెట్ ప్రేమికులు సంతాపం తెలిపారు.
Next Story