రాహుల్ ద్రావిడ్‌కు అస్వ‌స్థ‌త‌..!

Rahul Dravid leaves Team India, flies to Bengaluru alone due to health issues. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అనారోగ్యానికి గురయ్యారు. కోల్ కతాలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డే సమయంలో

By M.S.R  Published on  13 Jan 2023 12:01 PM GMT
రాహుల్ ద్రావిడ్‌కు అస్వ‌స్థ‌త‌..!

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అనారోగ్యానికి గురయ్యారు. కోల్ కతాలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డే సమయంలో కూడా ద్రావిడ్ అనారోగ్యంగానే ఉన్నా జట్టుతోనే ఆయన గడిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోల్ కతా నుంచి బెంగళూరుకు విమానంలో బయల్దేరారు. అనారోగ్యం నేపథ్యంలో తిరువనంతపురంలో జరిగే చివరి వన్డేకు ద్రావిడ్ అందుబాటులో ఉండరు.

రాహుల్ ద్రవిడ్ శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరుకు బయలుదేరగా, ఇతర సహాయక సిబ్బందితో సహా మిగిలిన భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో చివరి వన్డే కోసం తిరువనంతపురం చేరుకుంటారు. ఆరోగ్య కారణాల రీత్యా ద్రవిడ్ తెల్లవారుజామున కోల్‌కతా నుంచి బెంగళూరుకు విమానంలో బయలుదేరారు. గురువారం జరిగిన రెండో వన్డేలో అతను బీపీకి సంబంధించి ఫిర్యాదు చేశాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ద్రవిడ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐకి చెందిన ఒక అధికారి తెలిపారు. ఆదివారం మ్యాచ్‌కు ముందు శనివారం తిరువనంతపురంలో జట్టుతో చేరే అవకాశం కూడా ఉంది. బెంగుళూరు వెళ్లే విమానంలో ద్రవిడ్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Next Story