మళ్లీ విఫలం.. 'పృథ్వీ షా'కు ఏమయ్యింది.?
చాలా కాలంగా పేలవమైన ఫామ్తో సతమతమవుతున్న పృథ్వీ షా.. టీ20 ముంబై లీగ్ 2025లో కూడా బ్యాట్తో రాణించలేకపోయాడు.
By Medi Samrat
చాలా కాలంగా పేలవమైన ఫామ్తో సతమతమవుతున్న పృథ్వీ షా.. టీ20 ముంబై లీగ్ 2025లో కూడా బ్యాట్తో రాణించలేకపోయాడు. దీంతో అతడి నేతృత్వంలోని జట్టు 40 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్ 2025లో పృథ్వీ షా అమ్ముడుపోలేదు. దీంతో ముంబై లీగ్ 2025లో అతను అద్భుత ప్రదర్శన చేస్తాడని భావించారు.
T20 ముంబై లీగ్ 2025లో బుధవారం నమో బాంద్రా బ్లాస్టర్స్.. నార్త్ ముంబై పాంథర్స్తో తలపడింఇ. నార్త్ పాంథర్స్పై నమో బాంద్రా బ్లాస్టర్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమో బాంద్రా జట్టు 171 పరుగులకు ఆలౌటైంది. దీనికి సమాధానంగా బ్యాటింగ్కు దిగిన నార్త్ ముంబై 131 పరుగులకే పరిమితమైంది.
బాంద్రా బ్లాస్టర్స్పై పృథ్వీ షా ఓపెనర్గా బరిలోకి దిగాడు. కేవలం 4 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో కేవలం ఒక ఫోర్ మాత్రమే ఉంది. పృథ్వీ షా చాలా కాలంగా పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. అతడు దేశవాళీ క్రికెట్లో కూడా పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేకపోయాడు. దీంతో అతని ఫిట్నెస్ గురించి ప్రశ్నలు తలెత్తాయి. క్రమంగా జట్టులో స్థానం కోల్పోయాడు.
పృథ్వీ షా తొందరగా ఔటవడంతో అతని జట్టు నార్త్ ముంబై పాంథర్స్ కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. జట్టు తరఫున దివ్యాంష్ సక్సేనా అత్యధికంగా 42 పరుగులు చేశాడు. ఆయుష్ వర్తక్ 21 పరుగులు చేశాడు. గౌరవ్ జోథర్ 12 పరుగులు, స్వానిల్ జోథర్ 17 పరుగులు చేశారు.
అంతకుముందు బాంద్రా పాంథర్స్ తరఫున ధృమిల్ మట్కర్ 23 బంతుల్లో 52 పరుగులతో వేగమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఒక ఫోర్, 6 సిక్సర్లు ఉన్నాయి. ధృమిల్తో పాటు సువేద్ పార్కర్ 35 పరుగులు చేశాడు. వీరిద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్తో పాంథర్స్ 171 పరుగులు చేసింది.