కబడ్డీ లెజెండ్ పర్దీప్ నర్వాల్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ప్రో కబడ్డీ లీగ్ (PKL) 2025 వేలంలో అమ్ముడుపోకపోవడంతో ప్రొఫెషనల్ ఆట నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.
28 ఏళ్ల పర్దీప్ నర్వాల్ మూడుసార్లు PKL ఛాంపియన్, లీగ్ చరిత్రలో గొప్ప రైడర్లలో ఒకరిగా పేరు ఉంది. అతడిని రెండు రోజుల వేలంలో అన్ని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ముఖ్యంగా UP యోధాస్, పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ వంటి జట్లు 2వ రోజున అతన్ని ఎంపిక చేస్తాయని అంచనా వేసినప్పటికీ, ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదు. ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో నర్వాల్ మాట్లాడుతూ, తాను మొదట్లో బాధపడలేదని, కనీసం ఒక జట్టు అయినా ఆసక్తి చూపుతుందని ఆశించానని అన్నారు.
బెంగళూరు బుల్స్ జట్టు తరపున PKL సీజన్ 2లో అరంగేట్రం చేసిన నర్వాల్, పాట్నా పైరేట్స్తో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ జట్టును వరుసగా మూడు టైటిళ్లకు నడిపించాడు. లీగ్లో 1,000 రైడ్ పాయింట్లను అధిగమించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 190 మ్యాచ్లలో 1,801 రైడ్ పాయింట్లతో పర్దీప్ నర్వాల్ గొప్ప ఆటగాడిగా నిలిచాడు.