Paralympics 2024 : బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన నితీష్ కుమార్

పారిస్ పారాలింపిక్స్ 2024లో 5వ రోజు డిస్కస్ త్రోలో యోగేష్ కథునియా రజత పతకాన్ని గెలుచుకున్నాడు

By Medi Samrat
Published on : 2 Sept 2024 12:32 PM

Paralympics 2024 : బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన నితీష్ కుమార్

పారిస్ పారాలింపిక్స్ 2024లో 5వ రోజు డిస్కస్ త్రోలో యోగేష్ కథునియా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ నితేశ్‌ కుమార్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్‌కు ఇది 9వ ప‌త‌కం కాగా.. రెండవ స్వర్ణం. అంతకుముందు అవని లేఖరా షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.

నితీశ్ కుమార్ బ్రిటీష్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ డేనియల్ బెతెల్‌ను 21-14, 18-21, 23-21 స్కోరుతో ఓడించాడు. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను నితీశ్ 21-14 తేడాతో గెలుచుకున్నాడు. అయితే రెండవ గేమ్‌లో వెనుకబడ్డాడు. బెతెల్ గేమ్‌ను 18–21తో చేజిక్కించుకున్నాడు. మూడో గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య చాలా గట్టి పోటీ నెలకొంది. ఒక దశలో స్కోరు 20-20కి చేరుకుంది. అయితే నితీశ్ 23-21తో గేమ్‌ను గెలుచుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Next Story