FactCheck : పాకిస్థాన్ గెలిచినందుకు శ్రీనగర్ లో మరోసారి టపాసులను కాల్చారా..?
Old video shared as celebrations in Srinagar after Pak defeated India in Asia Cup. సెప్టెంబరు 4న, ఆసియా కప్లో సూపర్ 4లో భాగంగా భారత్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది పాకిస్థాన్.
By Medi Samrat Published on 6 Sep 2022 2:45 PM GMT
సెప్టెంబరు 4న, ఆసియా కప్లో సూపర్ 4లో భాగంగా భారత్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది పాకిస్థాన్. భారతదేశం ఓటమి తర్వాత శ్రీనగర్లో బాణసంచా కాల్చారని చెబుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
'పాకిస్థాన్ విజయం తర్వాత శ్రీనగర్లో బాణసంచా పేల్చారు' అనే క్యాప్షన్తో ఫేస్బుక్ యూజర్ వీడియోను షేర్ చేశారు.
శ్రీనగర్ ప్రజలు భారత ఓటమికి సంతోషిస్తూ క్రాకర్లు పేల్చి సంబరాలు చేసుకున్నారని పేర్కొంటూ హిందీ న్యూస్ ఛానెల్ సుదర్శన్ న్యూస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ వీడియోను కూడా షేర్ చేశారు.
అనేక మంది వినియోగదారులు రిపోర్ట్ చేయడంతో ఛానెల్ పోస్ట్ను తొలగించింది.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను యాక్సెస్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
సుదర్శన్ న్యూస్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ సాగర్ కుమార్ కూడా తప్పుదారి పట్టించే సమాచారంతో వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. శ్రీనగర్ పోలీసులు స్పందించిన తర్వాత అతను కూడా ఆ వీడియోను తొలగించాడు.
నిజ నిర్ధారణ :
NewsMeter వీడియో యొక్క కీఫ్రేమ్లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. 14 ఆగస్టు 2020న కాశ్మీర్ స్థానిక వార్తా సంస్థలు Facebookలో పోస్ట్ చేసిన అదే వీడియోను కనుగొంది. ఇది శ్రీనగర్లోని నవకడల్లో పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చూపించిందని వారు నివేదించారు.
శ్రీనగర్ పోలీసుల ట్విట్టర్ హ్యాండిల్ జర్నలిస్ట్ సాగర్ కుమార్ను "పాత వీడియోలను సర్క్యులేట్ చేయడం ద్వారా నకిలీ వార్తలు, పుకార్లను వ్యాప్తి చేయవద్దని హెచ్చరించినట్లు మేము కనుగొన్నాము."
శ్రీనగర్ పోలీసులు "ఈ వీడియో నవకడల్ చౌక్లోనిది. పాత వీడియోలను ప్రసారం చేయడం ద్వారా నకిలీ వార్తలు, పుకార్లను వ్యాప్తి చేయవద్దు. ఇలాంటివి ఎక్కడా నివేదించబడలేదు." అని అన్నారు.
The video is half a decade old from Nawakadal chowk. Don't spread fake news and sensationalism by circulating old videos. Nothing of this sort reported from anywhere. #FakeNewsAlert
వీడియో తీయబడిన ఖచ్చితమైన సంవత్సరాన్ని NewsMeter బృందం స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. అయితే, ఈ వీడియో 2020లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిందని మేము కనుగొన్నాము.
ఆసియా కప్ మ్యాచ్లో భారత్పై పాక్ గెలిచినందుకు శ్రీనగర్ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారంటూ పాత వీడియో ఒకటి ప్రచారం చేయబడుతోంది. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
Claim Review:పాకిస్థాన్ గెలిచినందుకు శ్రీనగర్ లో మరోసారి టపాసులను కాల్చారా..?