ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. రెండేళ్ల తర్వాత టైటిల్ కైవసం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం-శనివారం మధ్య రాత్రి చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం-శనివారం మధ్య రాత్రి చరిత్ర సృష్టించాడు. అతడు జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ను ఓడించడం ద్వారా రెండేళ్ల తర్వాత తన మొదటి డైమండ్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఇది మాత్రమే కాదు.. వెబర్ చేతిలో గత 2 టోర్నీల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం కూడా తీర్చుకున్నాడు.
గోల్డెన్ బాయ్ నీరజ్ తొలి రౌండ్లో 88.16 మీటర్లు విసిరి టైటిల్ను గెలుచుకున్నాడు. రెండో త్రో 85.10 మీటర్లు. దీని తర్వాత అతడి మూడు ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. చివరి ప్రయత్నంలో నీరజ్ 82.89 మీటర్లు విసిరాడు. ఈ డైమండ్ లీగ్ పోటీల్లో 90 మీటర్ల క్లబ్కు చెందిన ఐదుగురు పోటీదారులు పాల్గొన్నారు.
జూలియన్ వెబర్ తన మొదటి త్రోలో 87.88 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. బ్రెజిల్కు చెందిన లూయిజ్ మారిసియో డా సిల్వా మూడో రౌండ్లో 86.62 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్ 81.66 మీటర్లు విసిరాడు. గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 80.29 మీటర్లు విసిరి 5వ స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన జూలియస్ యెగో 80.26 మీటర్లు విసిరాడు.
నీరజ్ ఐదు రౌండ్ల ప్రదర్శన
మొదటి ప్రయత్నం- 88.16 మీటర్లు
రెండో ప్రయత్నం- 85.10 మీటర్లు
మూడవ ప్రయత్నం - ఫౌల్
నాల్గవ ప్రయత్నం - ఫౌల్
ఐదవ ప్రయత్నం - ఫౌల్
ఆరవ ప్రయత్నం - 82.89 మీటర్లు
ఇదిలావుంటే.. మే 16న దోహాలో జరిగిన డైమండ్ లీగ్లో చోప్రా 90.23 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు.