రుతురాజ్ గైక్వాడ్ అవుట్.. చెన్నై కెప్టెన్ గా మళ్లీ ధోని

రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఎముకలో పగులు కారణంగా 2025 సీజన్ లో ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు.

By Medi Samrat
Published on : 10 April 2025 8:47 PM IST

రుతురాజ్ గైక్వాడ్ అవుట్.. చెన్నై కెప్టెన్ గా మళ్లీ ధోని

రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఎముకలో పగులు కారణంగా 2025 సీజన్ లో ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో మిగిలిన సీజన్‌కు ఎంఎస్ ధోని CSK జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన హోమ్ మ్యాచ్‌కు ముందు రోజు ఏప్రిల్ 10న ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్ లో 28 ఏళ్ల గైక్వాడ్ మోచేయికి దెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తదుపరి రెండు మ్యాచ్‌లలో అతను ఆడినప్పటికీ, స్కాన్‌లు ఫ్రాక్చర్‌ను నిర్ధారించాయి.

దురదృష్టవశాత్తు, రుతురాజ్ గైక్వాడ్ టోర్నమెంట్ నుండి తప్పుకున్నాడని ఫ్లెమింగ్ తెలిపారు. IPLలో మిగిలిన మ్యాచ్ లలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి అన్‌క్యాప్డ్ ఆటగాడు MS ధోని జట్టులో ఉన్నాడని ఫ్లెమింగ్ వెల్లడించాడు. ఐదుసార్లు విజేతలుగా నిలిచిన జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ మొదటి ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయి, తొమ్మిదవ స్థానంలో ఉంది. గైక్వాడ్ గత నాలుగు సీజన్లలో మూడింటిలో CSK తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. టాపార్డర్ లో గైక్వాడ్ స్థానంలో ఎవరు వస్తారో చూడాలి.

Next Story