షమీ నిజమైన దేశభక్తుడు అంటున్న ఫ్యాన్స్‌.. ఎందుకంటే..?

వన్డే ప్రపంచకప్ 2023 ముగిసి చాలా రోజులైంది. ఈ ప్రపంచకప్ 2023లో మహ్మద్ షమీ త‌న‌ బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడు.

By Medi Samrat  Published on  30 Dec 2023 8:10 AM GMT
షమీ నిజమైన దేశభక్తుడు అంటున్న ఫ్యాన్స్‌.. ఎందుకంటే..?

వన్డే ప్రపంచకప్ 2023 ముగిసి చాలా రోజులైంది. ఈ ప్రపంచకప్ 2023లో మహ్మద్ షమీ త‌న‌ బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడు. అలాగే టోర్నీ మొత్తం నొప్పితో ఆడాడు. తొలి మ్యాచ్‌ల్లో షమీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోయినప్పటికీ.. ఆ త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుని టీమ్ ఇండియాకు అత‌డు ఎంత ముఖ్యమో నిరూపించాడు. 2023 ప్రపంచకప్‌లో షమీ పడ్డ‌ బాధ ఎవరికీ తెలియదు.

నివేదికల ప్రకారం.. మడమ నొప్పితో మహమ్మద్ షమీ మొత్తం ప్రపంచ కప్ 2023 ఆడాడు. ఈ సమయంలో నొప్పిని ఎదుర్కోవటానికి షమీ టోర్నమెంట్ సమయంలో ఇంజెక్షన్లు తీసుకున్నాడు. మహ్మద్ షమీ ప్రపంచ కప్ 2023కి ముందే గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు నొప్పితో జట్టు కోసం మ్యాచ్ ఆడాడు.

ఈ సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పుడు షమీని నిజమైన దేశభక్తుడు అని పిలుస్తున్నారు. ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ మహ్మద్ షమీ మన దేశం కోసం ప్రతిదీ చేసాడు అని వ్రాసాడు. మరో యూజర్ షమీ యోధ‌ అని కొనియాడాడు. వరల్డ్ కప్ 2023 ఫైనల్ తర్వాత అతను ఏ మ్యాచ్ ఆడలేదు. ఆయన త్వరగా కోలుకోవాల‌ని ఆశిస్తున్నారు.

2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మహమ్మద్ షమీ నిలిచాడు. షమీ టోర్నీలో అతి తక్కువ మ్యాచ్‌లు ఆడి అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 2023 ప్రపంచకప్‌లో షమీ 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. 3 సార్లు కంటే ఎక్కువ 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మహ్మద్ షమీని కూడా జట్టులోకి తీసుకున్నారు. అయితే గాయం కారణంగా షమీ జట్టులో చేరలేకపోయాడు. దీంతో సెంచూరియన్ టెస్టులో టీమ్ ఇండియా నష్టపోవాల్సి వచ్చింది.

Next Story