ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసేయమని చెబుతున్న కైఫ్
Mohammad Kaif Advice To Team India Players. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన
By Medi Samrat Published on 20 Dec 2020 7:08 AM GMTబోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలై.. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనకంజలో నిలిచింది. కాగా.. రెండో ఇన్నింగ్స్ భారత బ్యాట్స్మెన్లు సమిష్టిగా విఫలమై 36 పరుగులు మాత్రమే చేశారు. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఓ ఇన్నింగ్స్లో ఇదే అత్యత్ప స్కోరు.
భారత ఆటగాళ్ల చెత్త ఆటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో టీమిండియా మాజీ ఆటగాడు మొహమ్మద్ కైఫ్ ఆటగాళ్లకు ఓ సూచన చేశారు. మొబైల్ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయాలని సూచించాడు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగాలని చెప్పాడు.
ఈ ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఓటమి బాధను వర్ణించడానికి మాటలు రావడం లేదన్నాడు. మూడో రోజు బ్యాట్స్మెన్ సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేదని, నిజానికీ ఓటమి తనను తీవ్రంగా బాధిస్తోందని అన్నాడు. తొలి రెండు రోజులు బాగా ఆడామన్నాడు. మూడో రోజు 60 పరుగుల ఆధిక్యంతో వచ్చి మేము.. ఓ గంట పేలవమైన ఆట కారణంగా దారుణమైన స్థితికి చేరుకున్నామని తెలిపాడు. మరింత తీవ్రతతో ఆడాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆసీస్ బౌలర్లపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తొలి ఇన్నింగ్స్లానే లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా బౌలింగ్ వేశారని, ఆశావహ ధోరణి కూడా వారి విజయానికి బాటలు వేసిందని అన్నాడు. ఈ ఓటమి నుంచి చాలా విషయాలు నేర్చుకుమన్నాడు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టులో టీమ్ఇండియా బలంగా పుంజుకుంటుదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.