ఇక ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్స్ లెక్క..!

ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ ను ఓడిపోయింది.

By Medi Samrat
Published on : 7 May 2025 3:45 PM IST

ఇక ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్స్ లెక్క..!

ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ ను ఓడిపోయింది. ఈ మ్యాచ్ తమ నియంత్రణలో ఉన్నప్పటికీ కీలక సమయంలో పట్టు కోల్పోయామని ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే అన్నారు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఇక నుంచి మిగిలిన ప్రతి మ్యాచ్‌ను ప్లేఆఫ్స్ గానే పరిగణించనుంది. వర్షం కారణంగా సాగిన మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌పై వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

"ఆ వికెట్‌పై 30 పరుగులు తక్కువ చేశాము. గుజరాత్ టైటాన్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు, చాలా అవకాశాలను సృష్టించారు. చాలా బాగా ఫీల్డింగ్ చేశారు. తమ జట్టు కూడా ప్రతిదానికీ పోరాడింది, అది మంచి సంకేతం. ఇప్పుడు ప్రతి మ్యాచ్ ను ప్లేఆఫ్ గేమ్‌గా పరిగణిస్తాము," అని జయవర్ధనే జోడించాడు. ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో, దీపక్ చాహర్ ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టించాడు. అంతేకాకుండా ఒక నో-బాల్ కూడా వేశాడు. ముంబై ఇండియన్స్ ఆటపై మొదట్లోనే నియంత్రణ కోల్పోయిందని, అది తమ ఓటమికి కారణమని, చాహర్ వేసిన చివరి ఓవర్ కాదని జయవర్ధనే అన్నారు.

Next Story