జై షా ఎప్పుడూ బ్యాట్ పట్టుకోలేదు.. బీసీబీ మాజీ జాయింట్ సెక్రటరీ ఫైర్
ప్రస్తుతం క్రికెట్లో బంగ్లాదేశ్, భారత్ల మధ్య సంబంధాలు క్షీణించాయి. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ బహిష్కరించడంతో తీవ్ర దుమారం రేగింది.
By - Medi Samrat |
ప్రస్తుతం క్రికెట్లో బంగ్లాదేశ్, భారత్ల మధ్య సంబంధాలు క్షీణించాయి. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ బహిష్కరించడంతో తీవ్ర దుమారం రేగింది. BCCIకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ICC దగ్గరకు వెళ్ళింది.. కానీ అక్కడ కూడా చుక్కెదురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) మాజీ జాయింట్ సెక్రటరీ.. బీసీసీఐ మాజీ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ జయ్ షాపై దాడి చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న నేరాలపై భారత్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ను ఐపీఎల్లో ఆడకుండా బీసీసీఐ నిలిపివేసింది. వేలంలో అతడిని కోల్కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. BCCI తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత.. BCB వచ్చే నెల నుండి భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న T20 ప్రపంచ కప్లో తమ మ్యాచ్లను భారత్లో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలని ICCకి విజ్ఞప్తి చేసింది. అయితే.. బంగ్లా విజ్ఞప్తిని ICC నిరాకరించినట్లు తెలుస్తుంది.
ఐసిసి ఛైర్మన్గా భారత్కు చెందిన జే షా ఉన్నారు. BCB మాజీ సెక్రటరీ సయ్యద్ అష్రాఫుల్ హక్.. జై షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అతని సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తాడు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ - ప్రతిచోటా క్రికెట్ను రాజకీయ నాయకులు హైజాక్ చేసారు. ఒక్కసారి ఆలోచించండి, IS బింద్రా, మాధవరావు సింధియా, జగ్మోహన్ దాల్మియా, NKP సాల్వే, N శ్రీనివాసన్లు ఉండి ఉంటే ఏమి జరిగేది? వారు పరిణతి చెందిన వ్యక్తులు కాబట్టి ఇది జరగదు. వారు ఆటను అర్థం చేసుకున్నారు.. అందుకే వారు దానిలోని ప్రతి అంశాన్ని అర్థం చేసుకుంటారు. ఐపీఎల్ను బహిష్కరించిన విధంగా ప్రపంచకప్ను బహిష్కరించడం సాధ్యం కాదని హక్ అన్నారు. క్రికెట్ ఇప్పుడు పూర్తిగా హైజాక్ చేయబడిందని అన్నాడు. మీకు ఎప్పుడూ బ్యాట్ పట్టుకోని వ్యక్తులు ఉన్నారు. అది జై షా . ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ భారత్కు వెళ్లకూడదని మా క్రీడా సలహాదారు చెప్పారు. దాని గురించి ఆలోచించండి. ఇది ప్రపంచకప్ ఈవెంట్, ఐపీఎల్ కాదు. ఐపీఎల్ దేశవాళీ టోర్నీ. ఇది అంతర్జాతీయ కప్. మీరు అలాంటి పనికిమాలిన ప్రకటనలు చేయలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు