మార్చి 24, సోమవారం విశాఖపట్నంలో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన IPL 2025 సీజన్ ప్రారంభ మ్యాచ్కు సీనియర్ బ్యాట్స్మన్ KL రాహుల్ దూరమయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున అతడి అరంగేట్రం ఆలస్యం అయింది. వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ తరపున KL రాహుల్ తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. రాహుల్ తన కుటుంబంతో ఉండటానికి బయలుదేరినట్లు సమాచారం. రాహుల్, అతని భార్య అతియా శెట్టి తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. వైజాగ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే రెండో మ్యాచ్కు ముందు కెఎల్ రాహుల్ జట్టులో చేరే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ సారథ్యంలో ఆడుతోంది. ఢిల్లీ జట్టు కూడా ఈ సీజన్ లో అక్షర్ పటేల్ సారథ్యంలో ఆడుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్
అక్షర్ పటేల్ (కెప్టెన్), జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వి, ట్రిస్టాన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేశ్ కుమార్.
లక్నో సూపర్ జెయింట్స్
రిషబ్ పంత్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలాస్ పూరన్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్.