హైద్రాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. రేప‌టి నుండి అందుబాటులో టిక్కెట్లు

India-Aus Hyderabad T20I match online tickets to be available from Sep 15. సెప్టెంబర్ 25న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా

By Medi Samrat  Published on  14 Sept 2022 3:51 PM IST
హైద్రాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. రేప‌టి నుండి అందుబాటులో టిక్కెట్లు

సెప్టెంబర్ 25న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. టిక్కెట్లు పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ యాప్‌ల‌లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ ధరలు రూ.10,000 నుండి రూ.300 వరకు ఉంటుంది.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దాదాపు 55,000 మంది సామర్థ్యంతో హైద్రాబాద్ నగరంలో నిర్మించ‌బ‌డిన‌ ప్రధాన క్రికెట్ స్టేడియం. అత్యాధునిక సదుపాయాల‌తో నిర్మించిన ఈ స్టేడియం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)తో పాటు అనేక అంతర్జాతీయ మ్యాచ్‌ల‌కు ఆతిధ్యం ఇచ్చింది.

ఇదిలావుంటే.. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి.

టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షావీ , జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్


Next Story