క‌ష్టాల్లో టీమ్ఇండియా.. లంచ్ విరామానికి 80/4

IND trail by 125 runs at lunch.అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్ననాలుగో టెస్టులో టీమ్ఇండియా క‌ష్టాల్లో ప‌డింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2021 6:38 AM GMT
IND trail by 125 runs at lunch

అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా క‌ష్టాల్లో ప‌డింది. రెండో రోజు లంచ్ విరామానికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 80 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ (32; 106 బంతుల్లో 4 పోర్లు), రిష‌బ్ పంత్ (0) క్రీజులో ఉన్నారు. భార‌త జ‌ట్టు ఇంకా 125 పరుగులు వెన‌క‌బ‌డి ఉంది.

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోర్ 24/1 తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఓవ‌ర్‌నైట్ స్కోర్‌కు మ‌రో రెండు ప‌రుగులు మాత్ర‌మే జోడించిన పుజారా(17) జ‌ట్టు స్కోర్ 40 పరుగుల వ‌ద్ద జాక్ లీచ్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియ‌న్ చేరాడు. రికార్డుల రారాజు, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకుంటాడ‌ని అంతా బావించ‌గా.. కోహ్లీ మాత్రం ఇలా వ‌చ్చి అలా వెళ్లాడు. 8 బంతులు ఆడిన కోహ్లీ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భార‌త్ 41 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌కు వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానే జ‌త క‌లిసాడు.

ఓ వైపు రోహిత్ క్రీజులో పాతుకుపోగా.. ర‌హానే ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 45 బంతుల్లో 4 పోర్ల‌తో 25 ప‌రుగులు చేశాడు. స‌రిగ్గా లంచ్ విరామానికి ఒక బంతి ముందు ఔట‌య్యాడు. అండ‌ర్స‌న్ వేసిన ఇన్సింగ్స్ 37.5 బంతికి స్లిప్‌లో స్టోక్స్ చేతికి చిక్కాడు. దీంతో భార‌త్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం రోహిత్ క్రీజులో ఉండ‌గా.. పంత్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది.




Next Story