కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం

Inauguration of Kotak Pullela Gopichand Badminton Academy. కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ శనివారం ప్రారంభ‌మైంది.

By Medi Samrat  Published on  22 April 2023 1:25 PM GMT
కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం

కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ శనివారం ప్రారంభ‌మైంది. ఇండియ‌న్‌ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం, కోటక్ మహీంద్రా బ్యాంక్ శాంతి ఏకాంబరం, హోల్-టైమ్ డైరెక్టర్ జైమిన్ భట్, గ్రూప్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తో కలిసి ప్రారంభించారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, సీఎస్ఆర్ అసోసియేట్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో ఈ ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రం ప్రారంభ‌మైంది.

ఈ సందర్భంగా జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ క్రీడ‌లో కొట‌క్.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ప్రాజెక్ట్‌లో భాగంగా భారతదేశానికి మరిన్ని అవార్డులను తీసుకురావడానికి మరింత కృషిచేస్తున్నామని అన్నారు. బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఔత్సాహిక, అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణను అందించడానికి అంతర్జాతీయ స్థాయి కోచ్‌లతో పాటు అధునాతన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను అందిస్తున్నామని తెలిపారు.

2019లో కోటక్ మహీంద్రా బ్యాంక్ భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ల కోసం ప్రపంచ స్థాయి శిక్షణా సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (ఫౌండేషన్) భాగస్వామ్యంలో స్పోర్ట్స్‌లో తన సీఎస్ఆర్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ శిక్షణా సౌకర్యాన్ని ప్రారంభించడం రెండు సంస్థలకు ఒక ముఖ్యమైన మైలురాయి. దేశంలో అసాధారణమైన అథ్లెట్లు, కోచ్‌లను అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు.

పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ "ప్రస్తుత బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఒలింపిక్స్ నుండి కామన్వెల్త్ గేమ్స్ వరకు ప్రధాన ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశానికి పలు అవార్డులను తెచ్చిపెట్టిన ప్రపంచ ఛాంపియన్‌లను తయారు చేసే వారసత్వాన్ని కలిగి ఉంది. 15 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటి నుండి అకాడమీ దేశవ్యాప్తంగా గొప్ప ఆటగాళ్లకు సౌకర్యంగా మారింది. దేశంలో క్రీడల వృద్ధికి మద్దతుగా.. కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ.. ఆటగాళ్లకు అంతర్జాతీయ ప్రమాణాలకు బ్యాడ్మింటన్ శిక్షణను పెంచే అధునాతన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, కోచ్ అభివృద్ధిని అందిస్తుంది. క్రీడల్లో శ్రేష్ఠతను సాధించే దిశగా నడిపించే ఈ ప్రయాణంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఎస్ఆర్ నిధుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.



అనంతరం శాంతి ఏకాంబరం మాట్లాడుతూ "భారతదేశం నుండి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించడం, దేశంలోని భవిష్యత్తు యువత కోసం క్రీడా మౌలిక సదుపాయాలను, మార్గాలను బలోపేతం చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, పుల్లెల గోపీచంద్ తో కలిసి చేస్తున్నామని అన్నారు. మా సీఎస్ఆర్ ప్రయత్నాలు వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్య, జీవనోపాధి, పర్యావరణం, క్రీడలను అందరికీ అందుబాటులో ఉంచడంపై దృష్టి పెడుతున్నామని అన్నారు. పుల్లెల గోపీచంద్‌తో కలిసి దేశంలో క్రీడల పట్ల పెరుగుతున్న అభిరుచికి మద్దతుగా నిలిచిన అథ్లెట్‌లకు మద్దతు ఇవ్వడానికి అంకితమైన అతని ఫౌండేషన్‌తో అనుబంధంగా ఉండ‌టం మాకు గర్వంగా ఉందని అన్నారు.


Next Story