టెస్టు క్రికెట్లో నేటి నుంచి మహాయుద్ధం జరగనుంది. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్లో WTC ఫైనల్ 2025 మ్యాచ్ జరగనుంది. నేటి నుండి జూన్ 15 వరకు WTC ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది. ఆస్ట్రేలియాకు పాట్ కమిన్స్ కెప్టెన్ కాగా.. దక్షిణాఫ్రికాకు టెంబా బావుమా కెప్టెన్గా ఉన్నాడు.
ఆస్ట్రేలియా జట్టు గత ఎడిషన్లో భారత్ను ఓడించి WTC టైటిల్ను గెలుచుకుంది. ఇప్పుడు వారు రెండవసారి WTC టైటిల్ను గెలుచుకోవాలని చూస్తున్నారు. అయితే దక్షిణాఫ్రికా జట్టు మొదటిసారి WTC ఫైనల్కు చేరుకుంది. ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుండగా.. ఏ జట్టు ఈ టైటిల్ను గెలుచుకున్నా చరిత్ర సృష్టించడం ఖాయం. ఎలాగో తెలుసుకుందాం?
WTC 2025 ఫైనల్లో కంగారూ జట్టు గెలిస్తే.. ఫైనల్ మ్యాచ్లో రెండుసార్లు గెలిచి టైటిల్ సాధించిన మొదటి జట్టుగా రికార్డులకెక్కుతుంది. దక్షిణాఫ్రికా జట్టు తొలిసారిగా WTC ఫైనల్కు చేరుకుంది. చరిత్ర సృష్టించాలని తహతహలాడుతోంది. టెంబా బావుమా కెప్టెన్సీలో ఆఫ్రికన్ జట్టు అద్భుత ఆటను ప్రదర్శించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్స్కు చేరుకుంది. WTC ఫైనల్ 2025లో దక్షిణాఫ్రికా జట్టు గెలిస్తే.. అది మొదటిసారి ఈ టైటిల్ను గెలుచుకుంటుంది. తద్వారా దక్షిణాఫ్రికా WTC కొత్త ఛాంఫియన్గా అవతరించనుంది.