తమ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను భారతదేశం నుండి తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను ఐసీసీ బోర్డు తిరస్కరించింది. బోర్డు ఓటింగ్లో ఈ ప్రతిపాదన 14-2 తేడాతో వీగిపోయింది. సమావేశం తర్వాత, బంగ్లాదేశ్ జట్టు తన షెడ్యూల్ చేసిన మ్యాచ్ల కోసం భారతదేశానికి వెళ్లడానికి నిరాకరిస్తే 2026 టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ను ఇతర టీమ్ తో భర్తీ చేస్తామని ఐసీసీ హెచ్చరించింది.
ఓటింగ్ తర్వాత, ఫలితం గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయాలని ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరింది. బంగ్లాదేశ్ ప్రయాణించడానికి ఇష్టపడకపోతే, టోర్నమెంట్ నుండి తొలగించి స్కాట్లాండ్తో భర్తీ చేస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ తన వైఖరిని తెలియజేయడానికి మరో రోజు సమయం ఇచ్చింది ఐసీసీ.