సెప్టెంబర్ 14 ఆదివారం జరిగిన ఆసియా కప్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత ఆటగాళ్లపై ఫిర్యాదు చేశారు. గ్రూప్ దశ మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ బృందంతో కరచాలనం చేయడానికి నిరాకరించిన భారత జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసిందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ళు మ్యాచ్ ప్రారంభంలో లేదా చివరిలో పాకిస్తాన్తో కరచాలనం చేయలేదు. టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాతో కరచాలనం చేయలేదు. యాదృచ్ఛికంగా, టోర్నమెంట్కు ముందు కెప్టెన్ల విలేకరుల సమావేశంలో కూడా సూర్యకుమార్, ఆఘా కరచాలనం చేయలేదు. భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా షాకివ్వడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు అవాక్కయారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా మ్యాచ్ తర్వాత జరిగే బహుమతి ప్రజెంటేషన్ వేడుకను బహిష్కరించడానికి దారితీసింది. సాధారణంగా ఇందుకు రెండు జట్ల కెప్టెన్లు హాజరు అవుతూ ఉంటారు.