ఆర్సీబీ అభిమానులకు శుభవార్త.. బెంగళూరులో ఆగిన‌ వర్షం.. కాసేపట్లో మ్యాచ్ ఆరంభం

Good news for RCB fans, the rain has stopped in Bengaluru. ఐపీఎల్ 16వ సీజన్ 70వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) గుజరాత్ టైటాన్స్‌తో

By Medi Samrat
Published on : 21 May 2023 7:55 PM IST

ఆర్సీబీ అభిమానులకు శుభవార్త.. బెంగళూరులో ఆగిన‌ వర్షం.. కాసేపట్లో మ్యాచ్ ఆరంభం

ఐపీఎల్ 16వ సీజన్ 70వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్ రౌండ్‌లో ఇదే చివరి మ్యాచ్ కావ‌డం విశేషం. పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. గుజరాత్‌ను ఓడించడం ద్వారా ఆర్‌సిబి ప్లేఆఫ్‌లో స్థానం సంపాదించాలని చూస్తోంది. బెంగళూరులో మ‌ద్యాహ్నం నుంచి కురుస్తున్న‌ వర్షం ఆగిపోయింది. రాత్రి 7:45 గంటలకు టాస్ ప‌డింది. 15 నిమిషాల తర్వాత మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈరోజు జరిగిన మరో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ విజయంతో ముంబై 14 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు సాధించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును దాటి ముంబై నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ప్లేఆఫ్స్‌లో నిల‌వాలంటే గుజరాత్‌పై గెలవడం తప్ప ఆర్‌సీబీకి మరో మార్గం లేదు.


Next Story