కొత్త లీగ్ మొదలుపెట్టనున్న గౌతం గంభీర్

Gautam Gambhir Starts Delhi Cricket League. బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ కొత్త లీగ్ ను మొదలుబెట్టబోతున్నామని

By Medi Samrat  Published on  11 Sep 2021 10:38 AM GMT
కొత్త లీగ్ మొదలుపెట్టనున్న గౌతం గంభీర్

బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ కొత్త లీగ్ ను మొదలుబెట్టబోతున్నామని కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తూర్పు ఢిల్లీ క్రికెట్‌ లీగ్‌ను ఆరంభించనున్నట్లు వెల్లడించారు. యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా శుక్రవారం ప్రకటించారు. తన నియోజకవర్గంలోని యమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను అభివృద్ది చేసిన గంభీర్‌.. దీనిని ప్రపంచస్థాయి మైదానంగా తీర్చిదిద్దామని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తూర్పు ఢిల్లీ పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల నుంచి జట్లను ఎంపిక చేసి.. ఈస్ట్‌ ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

నవంబరు రెండో వారంలో ఈ టోర్నీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రంజీ ట్రోఫీ నిర్వహణ స్థాయికి తగ్గట్లు యమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. రెండు డ్రెస్సింగ్‌రూంలు, హైమాస్ట్‌ లైట్స్‌, ఆరు పిచ్‌లు, ప్రాక్టీసు​ పిచ్‌లు, డిజిటల్‌ స్కోరు బోర్డు డిస్‌ప్లే, కానపీ, జాగింగ్‌ ట్రాక్‌ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు 9 కోట్ల 25 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. క్రికెట్‌తో పాటు ఆర్చరీ కోసం కూడా దీనిని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Next Story