ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కోహ్లీ సేన‌

England Won Third Test Against India. హెడింగ్లేలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని

By Medi Samrat  Published on  28 Aug 2021 12:10 PM GMT
ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కోహ్లీ సేన‌

హెడింగ్లేలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 278 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లండ్.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(59), పుజారా అర్ధశతకాలతో రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. 215-2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్ నాటకీయంగా వికెట్లు కోల్పోయింది. 73 పరుగుల తేడాతో 8 వికెట్లు చేజార్చుకుంది.

అంతకుముందు.. పుజారాను అవుట్ చేయడం ద్వారా భారత్ పతనానికి ఓల్లీ రాబిన్సన్ శ్రీకారం చుట్టాడు. సెంచరీకి 9 పరుగుల దూరంలో పుజారా అవుట్ కాగా.. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ కోహ్లీ (55), రహానే (10) కూడా వెనుదిరిగారు. పంత్ కేవలం 1 పరుగు చేసి నిరాశపరిచాడు. షమి(6), ఇషాంత్‌(2), జడేజా(30), సిరాజ్‌(0) కనీసం పోరాటం కూడా చేయకుండా వెనుదిరిగారు. బుమ్రా(1) నాటౌట్‌గా నిలిచాడు. చివరికి భారత్‌ 99.3 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. రాబిన్సన్ కు 5 వికెట్లు, ఓవ‌ర్ట‌న్‌కు మూడు వికెట్లు లభించాయి. సిరీస్‌లో నాలుగో టెస్టు సెప్టెంబ‌ర్ 2న జ‌రుగ‌నుంది.


Next Story