ఇంగ్లాండ్ లయన్స్ vs ఇండియా ఎ మొదటి అనధికారిక టెస్ట్ కాంటర్బరీలో నిర్వహిస్తున్నారు. ఇంగ్లాండ్ లయన్స్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో ఇండియా ఎ జట్టు 500 పరుగుల మార్కు చేరింది. కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ సాధించాడు. 204 పరుగులు చేసి కరుణ్ నాయర్ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇక మిగిలిన బ్యాటర్లలో 94 పరుగులు చేసి ధృవ్ జురెల్ అవుటయ్యాడు. సర్ఫరాజ్ కూడా 92 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో జైస్వాల్ 24 పరుగులు చేసి అవుట్ అవ్వగా, అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఇక తెలుగు తేజం నితీష్ రెడ్డి పేలవ ఫామ్ కొనసాగుతూ ఉంది. 22 బంతులాడి 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.