చెన్నై కు షాకిచ్చిన ఢిల్లీ.. ధోని దంచుడు వృధా..!

MS ధోని విశాఖపట్నంలో సూపర్ సిక్సర్లతో అభిమానులను అలరించినా.. చెన్నై జట్టు ఢిల్లీని ఓడించలేకపోయింది.

By Medi Samrat  Published on  1 April 2024 3:04 AM GMT
చెన్నై కు షాకిచ్చిన ఢిల్లీ.. ధోని దంచుడు వృధా..!

MS ధోని విశాఖపట్నంలో సూపర్ సిక్సర్లతో అభిమానులను అలరించినా.. చెన్నై జట్టు ఢిల్లీని ఓడించలేకపోయింది. వైజాగ్‌లోని ఢిల్లీ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ రెండు అద్భుతమైన విజయాలతో టోర్నమెంట్ ను ప్రారంభించగా.. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బలహీనతలు బహిర్గతమయ్యాయి. సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. 20 పరుగుల తేడాతో ఓడిపోయారు. అయితే MS ధోని అత్యుత్తమ ప్రదర్శనను చూసి విశాఖపట్నం ప్రేక్షకులు తెగ ఆనందపడిపోయారు. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నార్ట్జే పై 2 భారీ సిక్సర్లను బాదాడు. ధోని 16 బంతుల్లో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు, 3 సిక్సర్లు, 4 బౌండరీలతో CSK నెట్ రన్ రేట్ దెబ్బ తినకుండా చూసుకున్నాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 191/5 స్కోరు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్(51) ఈ మ్యాచ్‌లో మాత్రం చెలరేగాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(52) కూడా అర్ధ శతకం బాదగా.. పృథ్వీ షా(43) సైతం మెరిశాడు. చెన్నయ్ బౌలర్లలో పతిరణ(3/31) రాణించాడు. 192 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 171/6 స్కోరుకే పరిమితమైంది. అజింక్య రహానే(45), మిచెల్(34), ధోనీ(37), జడేజా(21 నాటౌట్) రాణించారు. అప్పటికీ చెన్నై ఓటమి ఖరారు అయినా ధోనీ మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 2, అక్షర్ పటేల్‌కు ఒక్క వికెట్ దక్కింది.

Next Story