ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. DC పేరిట చెత్త రికార్డ్..!
IPL 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు ప్రయాణం ముగిసింది.
By Medi Samrat
IPL 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు ప్రయాణం ముగిసింది. మే 21న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 59 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో ఓటమితో ఢిల్లీ జట్టు ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్కు చేరుకోలేకపోగా.. ఇప్పటి వరకు ఐపిఎల్ చరిత్రలో ఏ టీమ్ పేరిట లేని చెత్త రికార్డు కూడా ఢిల్లీ జట్టు పేరిట నమోదైంది. టోర్నమెంట్లో మొదటి నాలుగు మ్యాచ్లు గెలిచిన తర్వాత ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అవతరించింది. ఇంతకుముందు ఐపీఎల్లో ఇలాంటి రికార్డు ఏ జట్టు పేరిట లేకపోవడం విశేషం.
ముంబై ఇండియన్స్ (MI) ఢిల్లీ క్యాపిటల్స్ను 59 పరుగుల తేడాతో ఓడించింది. హార్దిక్ కెప్టెన్గా ఉన్న ముంబై ప్లేఆఫ్లోకి ప్రవేశించింది. ముంబై జట్టు IPL 2025 ప్లేఆఫ్స్లోకి ప్రవేశించిన నాల్గవ జట్టుగా అవతరించింది. RCB, గుజరాత్ మరియు పంజాబ్ జట్లు ప్లేఆఫ్స్కు చేరుకున్నాయి.
వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ హాఫ్ సెంచరీతో డీసీ 181 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా మ్యాచ్ ఆడలేకపోయాడు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. సమీర్ రిజ్వీ 39 పరుగులు చేయగా, విప్రజ్ నిగమ్ 20 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
IPL 2025 ప్లేఆఫ్లకు అర్హత సాధించిన నాలుగు జట్ల చిత్రం స్పష్టమైంది. ముంబై ఇండియన్స్ కంటే ముందు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు నాకౌట్ రౌండ్లోకి ప్రవేశించాయి. ప్లేఆఫ్ రేసు ముగిసినా.. టాప్-2 కోసం పోరు కొనసాగుతోంది. ముంబై తమ చివరి మ్యాచ్లో గెలవడం ద్వారా 18 పాయింట్లను చేరుకోవాలనుకుంటోంది, అయితే గుజరాత్కు 22 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. పంజాబ్-ఆర్సిబికి ఒక్కొక్కటి గరిష్టంగా 21 పాయింట్లను చేరుకునే అవకాశం ఉంది.