Delhi Capitals' bus ATTACKED in Mumbai. మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2022 మ్యాచ్ల కోసం ఆటగాళ్లను
By Medi Samrat Published on 17 March 2022 10:57 AM GMT
మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2022 మ్యాచ్ల కోసం ఆటగాళ్లను తీసుకెళ్లడానికి ఫైవ్ స్టార్ హోటల్ బయట పార్క్ చేసిన కనీసం ఒక లగ్జరీ బస్సు అద్దాలను పగులగొట్టారు. త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2022 మ్యాచ్ల కోసం ఆటగాళ్లను తీసుకెళ్లడానికి ఉద్దేశించబడింది. ధ్వంసమైన వాహనాన్ని IPL ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బస్సుగా ఉపయోగించాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపి ఉంచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టీమ్ బస్సుపై దాడి చేసినందుకు పలు సెక్షన్ల కింద 5-6 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ముంబైలోని కొలాబా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది.
ఘటనకు సంబంధించిన సమాచారం రాగానే కొలాబా పోలీస్ స్టేషన్ ఒక బృందాన్ని అక్కడికి తరలించి, సంఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసింది. అర్ధరాత్రికి కొద్దిసేపటి ముందు, MNS-వహతుక్ సేన (రవాణా విభాగం)కి చెందిన అరడజను మంది కార్యకర్తలు బస్సు దగ్గరికి చేరి, బస్సు ముందు తమ డిమాండ్ల పోస్టర్లను అతికించి, నినాదాలు చేసి, కిటికీలు ధ్వంసం చేయడం ప్రారంభించారు. టోర్నమెంట్ కోసం రాష్ట్రం బయట నుండి బస్సులను అద్దెకు తీసుకున్నారని.. అందుకే తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని నిరసన కారులు అన్నారు. నిర్వాహకులకు అవసరమైన వాహనాలను అందించగలగినప్పటికీ స్థానికులకు ఉపాధి అవకాశాలను ఇవ్వలేదని విమర్శించారు.