భారత జట్టుకు ఎటువంటి టెన్షన్ ఉండదు.. కఠినమైన బయో బబుల్ ను అమలు చేస్తాం: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు

Cricket South Africa Assures Strict Bio-Bubble Arrangements For India Tour. కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్ తో ప్రపంచాన్ని భయపెడుతూ ఉంది.

By Medi Samrat  Published on  1 Dec 2021 2:43 PM GMT
భారత జట్టుకు ఎటువంటి టెన్షన్ ఉండదు.. కఠినమైన బయో బబుల్ ను అమలు చేస్తాం: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు

కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్ తో ప్రపంచాన్ని భయపెడుతూ ఉంది. ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను ఎంతగానో భయపెడుతూ ఉంది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ పుట్టిందని వార్త రావడంతో భారత క్రికెట్ జట్టు పర్యటన వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే భారత ఆటగాళ్లను కఠినమైన బయో బబుల్ లో ఉంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటామని దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం హామీ ఇస్తోంది. భారతదేశంతో చాలా ముఖ్యమైన సిరీస్‌కు ముందు బయో-బబుల్ ఏర్పాట్ల గురించి ప్రపంచానికి భరోసా ఇచ్చే ప్రయత్నంలో, క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) అత్యున్నత ప్రమాణాలతో బయో బబుల్ ను ఏర్పాటు చేశామని స్పష్టం చేసింది. భారత జట్టు మూడు టెస్టు మ్యాచ్ లు, మూడు వన్డేలు మరియు నాలుగు T20Iలు ఆడాల్సి ఉంది.

డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో మొదటి టెస్ట్‌తో ప్రారంభమై, జనవరి 26న పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో నాలుగో T20Iతో సిరీస్ ముగుస్తుంది. కానీ వివిధ దేశాలు జారీ చేసిన ప్రయాణ నిషేధాలతో పాటు కొత్త COVID-19 వేరియంట్ కారణంగా ఈ టూర్ సందేహంలో పడింది. CSA బుధవారం నాడు భారతదేశ పర్యటనను సంబంధించి అధిక-నాణ్యత ఉన్న బయో-బబుల్స్‌లో మ్యాచ్ లను నిర్వహించగల సామర్థ్యాల గురించి ఒక ప్రకటనను విడుదల చేసింది. "CSA ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆటగాళ్ళు, సిబ్బంది మరియు అధికారులను బయో బబుల్ వాతావరణంలో రక్షిస్తోందని.. కఠినమైన ప్రవేశ ప్రమాణాలు మరియు పరిమిత కదలికల తో సిరీస్ ను నిర్వహిస్తాం. బయో-సురక్షిత వాతావరణంలో రక్షణను అందిస్తాం" అని CSA యొక్క చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మంజ్రా అన్నారు.


Next Story