క్రికెట్ ఫీవర్.. భారత్ గెలవాలని పూజలు
Cricket fans prayers offered across the country for team india's win.దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. దాయాదులు భారత్
By తోట వంశీ కుమార్ Published on 24 Oct 2021 9:34 AM GMT
దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. దాయాదులు భారత్, పాకిస్థాన్ దుబాయ్ వేదికగా నేడు తలపడనున్నాయి. ఈ రోజు రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులు తలపడనుండడంతో దేశంలో ఎక్కడ చూసినా.. ఎవ్వరిని కదిలించినా ఈ మ్యాచ్ గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు టీ 20, వన్డే ప్రపంచ కప్లలో ఇరు జట్లు 12 సార్లు తలపడగా.. అన్ని సార్లు భారత జట్టే గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు కూడా భారత జట్టే విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Cricket fans from Punjab's Ludhiana (pic 1 & 3) to Karnataka's Kalaburagi (pic 2 & 4) pray for Team India's win against Pakistan in ICC T20 World cup match at Dubai#INDvPAK pic.twitter.com/HQPbk3SBRw
— ANI (@ANI) October 24, 2021
పాక్పై గెలవడంతో పాటు టీ 20 ప్రపంచకప్ను సాధించాలని బెంగళూరు, ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల్లో అభిమానులు పూజలు చేస్తున్నారు. భారత జట్టు టీమ్ సభ్యుల ఫోటోలకు హారతులు ఇస్తున్నారు. ఇక ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్పటికే పలు నగరాల్లో మల్టీఫెక్స్లు, హోటళ్లు, పబ్లతో మ్యాచ్ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు చేధనకే మొగ్గు చూపే అవకాశం ఉంది.