రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా ఉండేది అత‌డే.. క‌న్ఫ‌ర్మ్ చేసిన గంభీర్‌

నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది.

By Kalasani Durgapraveen
Published on : 11 Nov 2024 10:45 AM IST

రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా ఉండేది అత‌డే.. క‌న్ఫ‌ర్మ్ చేసిన గంభీర్‌

నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది. దీని కోసం టీమిండియాలోని సగం మంది నవంబర్ 10న ఆస్ట్రేలియాకు వెళ్లగా.. మిగిలిన జట్టు ఈరోజు బయలుదేరనుంది. తొలి టెస్టుకు ముందు ఈరోజు అంటే నవంబర్ 11న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు.

ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు గంభీర్ సమాధానాలు ఇచ్చాడు. పెర్త్‌ టెస్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో లేకుంటే అతడి స్థానంలో టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారని ఆయనను అడిగారు. నిజానికి.. ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని చాలా కాలంగా వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఇంకా ధృవీకరించబడలేదు.

ఇటీవల, భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా విలేకరుల సమావేశంలో రోహిత్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడతాడా లేదా అనే విషయాన్ని ధృవీకరించలేదు. ఒకవేళ రోహిత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడకపోతే, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ ప్రత్యామ్నాయం అని గంభీర్ ఖచ్చితంగా చెప్పాడు. ఒకవేళ రోహిత్ తొలి టెస్టుకు అందుబాటులో లేకుంటే.. అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రాకి జట్టు కమాండ్ ఇస్తానని గంభీర్ చెప్పాడు.

Next Story