ఆ హైదరాబాద్ బిజినెస్ మ్యాన్‌తో జాగ్రత్త : బీసీసీఐ హెచ్చరికలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనేవారిని అవినీతి కార్యకలాపాల్లోకి ఆకర్షించే ప్రయత్నాల గురించి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) వాటాదారులకు, ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది.

By Medi Samrat
Published on : 16 April 2025 8:33 PM IST

ఆ హైదరాబాద్ బిజినెస్ మ్యాన్‌తో జాగ్రత్త : బీసీసీఐ హెచ్చరికలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనేవారిని అవినీతి కార్యకలాపాల్లోకి ఆకర్షించే ప్రయత్నాల గురించి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) వాటాదారులకు, ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లను ట్రాప్ చేయడానికి ఓ వ్యాపారవేత్త చురుకుగా ప్రయత్నిస్తున్నారని బీసీసీఐ ఐపీఎల్ జట్ల యజమానులు, ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వ్యాఖ్యాతలను కూడా హెచ్చరించింది.

పంటర్లు, బుకీలతో స్పష్టమైన సంబంధాలు, అవినీతి కార్యకలాపాలలో పాల్గొన్నట్లు గతంలో రికార్డులు కలిగిన హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ఐపీఎల్ లో భాగమైన వారితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అవినీతి నిరోధక భద్రతా విభాగం (ACSU) భావిస్తోంది. వ్యాపారవేత్తతో ఏవైనా సంభాషణలు జరిగినా వాటి గురించి నివేదించాలని, అతనితో ఏవైనా సంబంధాలు ఉంటే బహిర్గతం చేయాలని ACSU అన్ని IPL వాటాదారులను కోరింది.

లీగ్‌లో పాల్గొన్న అన్ని పార్టీలు జాగ్రత్తగా ఉండాలని ACSU కోరింది. జట్లు, వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సంబంధిత సమాచారాలని నివేదించాలని కోరారు. ఖరీదైన బహుమతులతో సదరు వ్యక్తి ఆకర్షించే అవకాశాలు ఉందని బీసీసీఐ తెలిపింది.

Next Story