ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ను ముంబయి ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.
మెండిస్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ భారీ షాట్లతో అలరించాడు. అప్పటికే సాయి సుదర్శన్ మ్యాచ్ ను ముంబై నుండి లాగేసుకునే ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు స్కోర్ 150 పరుగులు దాటింది కూడా!! జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన యార్కర్ తో సుందర్ను క్లీన్బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 15.3 ఓవర్ల వద్ద గ్లీసెన్ కూడా చక్కటి యార్కర్తో సుదర్శన్(80)ను అవుట్ చేశాడు.
సుందర్ ను బుమ్రా అవుట్ చేసిన విధానంపై ప్రశంసలు కురుస్తున్నాయి. బెస్ట్ బాల్ ఆఫ్ ఐపీఎల్ 2025 అంటూ చెబుతున్నారు.