ముగిసిన డెడ్ లైన్.. కోచ్ అయ్యేది ఎవరో?

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగిసింది. అయితే BCCI ప్రకారం కోచ్ రేసులో మొదటి వరుసలో ఉన్న గౌతమ్ గంభీర్ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.

By Medi Samrat
Published on : 28 May 2024 8:12 AM IST

ముగిసిన డెడ్ లైన్.. కోచ్ అయ్యేది ఎవరో?

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగిసింది. అయితే BCCI ప్రకారం కోచ్ రేసులో మొదటి వరుసలో ఉన్న గౌతమ్ గంభీర్ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఆదివారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్‌ మూడవ ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకున్న తర్వాత.. గంభీర్ పేరు మరింత ఊపందుకుంది.

దేశవాళీ క్రికెట్ గురించి తెలిసిన వారి కోసం బోర్డు వెతుకుతుందని బీసీసీఐ కార్యదర్శి జే షా స్పష్టం చేశారు. ఈ పదవికి చెప్పుకోదగ్గ విదేశీ క్రికెటర్లు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. BCCI ప్రాధమిక లక్ష్యం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ VVS లక్ష్మణ్ అని చెప్పవచ్చు. అయితే లక్ష్మణ్ పూర్తి సమయం పదవిపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. జూన్ నెలలో టీ20 ప్రపంచ కప్ తో భారత జట్టు బిజీగా ఉంటుంది. ఆ తర్వాత సీనియర్లకు విశ్రాంతి ఇస్తారు. శ్రీలంక, జింబాబ్వే పర్యటనల నుండి NCA ఆధారిత సీనియర్ కోచ్‌లలో ఎవరైనా జట్టుతో పాటు వెళ్లవచ్చు, కాబట్టి కోచ్ ఎంపికపై తొందరపాటు అవసరం లేదని బీసీసీఐ మూలాలు తెలిపాయి.

Next Story