ఫీల్డింగ్ కోచ్గా మళ్లీ అతడినే తీసుకొచ్చిన రోహిత్ శర్మ..!
టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భారత జట్టులోకి తిరిగి రావడం ఖాయమైంది.
By Medi Samrat
టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భారత జట్టులోకి తిరిగి రావడం ఖాయమైంది. దిలీప్ మునుపటి ఒప్పందం మార్చి 2025లో ముగిసింది. ఆయన ఒప్పందాన్ని పొడిగించడానికి బోర్డు ఇష్టపడలేదని నివేదికలు వెలువడ్డాయి. అయితే దిలీప్ భారత జట్టులోకి తిరిగి రావడంలో వెటరన్ ఆటగాడు రోహిత్ శర్మ వ్యక్తిగత మద్దతు కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని కొత్త నివేదిక వెల్లడించింది.
'క్రిక్బజ్'లోని ఒక నివేదిక ప్రకారం.. దిలీప్ను తిరిగి జట్టులో చేర్చుకోవాలని రోహిత్ స్వయంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బోర్డు అధికారులను అభ్యర్థించాడు.. ఆ తర్వాత అతనికి మరో ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రోహిత్ టెస్ట్, టీ20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ.. అతని ప్రభావం, జట్టుకు అందించిన సహకారాన్ని విస్మరించలేము.
అతనితో పాటు గత నెలలో బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్, మరికొందరు సహాయక సిబ్బందిని కూడా తొలగించాలని BCCI యోచించింది. అయితే ఇప్పుడు బోర్డు మాట మార్చింది. సహాయక సిబ్బందిని తగ్గించ, ఫలితాలు రాబట్టే వ్యూహంలో భాగంగా గౌతమ్ గంభీర్, అగార్కర్ నేతృత్వంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
టి దిలీప్ తన వ్యక్తిగత శిక్షణా విధానం, ఫీల్డింగ్ కసరత్తుల ద్వారా ఎంతో ప్రసిద్ధి చెందాడు. అతని హయాంలో భారత్ స్లిప్ ఫీల్డింగ్లో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఇది చాలా మంది ప్రశంసలు పొందింది. ఆయన 2023 ODI ప్రపంచ కప్, 2024 T20 ప్రపంచ కప్ సమయంలో 'బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్' అనే ప్రత్యేకమైన సంప్రదాయాన్ని ప్రారంభించాడు, ఇది ఆటగాళ్లలో పోటీ, ఉత్సాహాన్ని ప్రోత్సహించింది.
ఈ విషయంపై ఆయన సన్నిహితులు పిటిఐతో మాట్లాడుతూ.. 'దిలీప్ మంచి కోచ్, అతను మూడు సంవత్సరాలు జట్టుకు బాగా సేవలందించాడు. అతనికి టీమ్ ఇండియాలోని చాలా మంది ఆటగాళ్లు బాగా తెలుసు. అందువల్ల భారీ సిరీస్కి అతడిని జట్టులోకి తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుంది. అందుకే ఈ సమయంలో కొత్త పేరు తీసుకురావడంలో అర్థం లేదు.