ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌.. సూర్య‌కు తొలిసారి అవ‌కాశం

BCCI announces India squad for ODI series.ఇంగ్లాండ్‌‌తో జ‌ర‌గ‌నున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును బీసీసీఐ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2021 6:33 AM GMT
BCCI announces India squad for ODI series

ఇంగ్లాండ్‌‌తో జ‌ర‌గ‌నున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. 18 మందితో కూడిన జాబితాను విడుద‌ల చేసింది. సూర్యకుమార్ యాదవ్, ప్ర‌సిద్ద్ కృష్ణ‌ల‌కు తొలిసారి వ‌న్డే జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఆడిన రెండో టీ20లోనే అర్థ‌శ‌త‌కంతో స‌త్తా చాటిన సూర్య‌కుమార్ వ‌న్డేల్లో త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోనున్నాడు. క్రునాల్ పాండ్యాతో పాటు భువ‌నేశ్వ‌ర్ కుమార్ తిరిగి వ‌న్డే జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయ‌ప‌డిన‌ పేస‌ర్ ష‌మి, ఆల్‌రౌండ‌ర్ జ‌డేజా లు ఇంకా కోలుకోకపోవ‌డంతో వారి పేర్ల‌ను ప‌రిగ‌న‌లోకి తీసుకోలేదు.

ఇక ఆసీస్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ఆడిన మ‌యాంక్ అగ‌ర్వాల్‌, మ‌నీష్ పాండే, సంజు శాంస‌న్‌లు త‌మ చోటును నిలుపుకోలేక‌పోయారు. మిగిలిన టీమ్‌లో పెద్ద‌గా మార్పులు లేవు. టీ20 సిరీస్‌కు దూర‌మైన న‌ట‌రాజ‌న్ వ‌న్డే సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. పూణె వేదిక‌గా మూడు వ‌న్డేల సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే మార్చి 23న జ‌ర‌గ‌నుంది.

భార‌త జ‌ట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ‌(వైస్ కెప్టెన్‌), ధావ‌న్‌, శుభ్‌మ‌న్ గిల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సూర్యకుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, కేఎల్ రాహుల్‌, చాహ‌ల్‌, కుల్‌దీప్‌, కృనాల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, న‌ట‌రాజ‌న్‌, భువ‌నేశ్వ‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, శార్దూల్ ఠాకూర్


Next Story