ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ రద్దు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

By Medi Samrat  Published on  25 Feb 2025 9:18 PM IST
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ రద్దు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న రావల్పిండిలో వర్షం పడుతుండడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. 20 ఓవర్ల మ్యాచ్ జరిపేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చెరో పాయింట్ పంచుకున్నాయి.

గ్రూప్-బి పాయింట్ల పట్టిక చూస్తే... దక్షిణాఫ్రికా, ఆసీస్ చెరో 3 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ ఇంకా ఖాతా తెరవలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ చేరాయి. ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించాయి. రేపు ఆఫ్ఘనిస్థాన్ ఇంగ్లండ్ తో తలపడనుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దవ్వడంతో గ్రూప్ బి నుండి క్వాలిఫై అయ్యే అవకాశం ఎవరికి దక్కుతుందో అనే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది.

Next Story