ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా తన ప్లేయింగ్ 11లో రెండు మార్పులు చేసింది. గాయపడిన మాథ్యూ షార్ట్, స్పెన్సర్ జాన్సన్ స్థానంలో కూపర్ కొన్నోలీ, తన్వీర్ సంఘాలను జట్టులో చేర్చినట్లు టాస్ తర్వాత స్టీవ్ స్మిత్ చెప్పాడు. భారత జట్టు ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ను ఓడించిన ప్లేయింగ్ 11పైనే కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 14 వన్డేలో కూడా టాస్ ఓడాడు.
భారత్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా
కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.