అర్ష్‌దీప్ సింగ్‌, అవేష్ ఖాన్ ధాటికి 116 పరుగులకే కుప్ప‌కూలిన సౌతాఫ్రికా

భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం అయ్యింది. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో

By Medi Samrat  Published on  17 Dec 2023 10:57 AM GMT
అర్ష్‌దీప్ సింగ్‌, అవేష్ ఖాన్ ధాటికి 116 పరుగులకే కుప్ప‌కూలిన సౌతాఫ్రికా

భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం అయ్యింది. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో ఈరోజు తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణ‌యం త‌ప్ప‌ని కాసేప‌ట్లోనే తేలిపోయింది. దక్షిణాఫ్రికా జట్టు కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా జట్టును తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లు ఇబ్బంది పెట్టారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే అర్ష్ దీప్ సింగ్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. వ‌రుసగా రెండు బంతుల్లో రీజా హెండ్రిక్స్(0), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్‌(0)లను పెవిలియన్‌కు పంపాడు. అయితే హ్యాట్రిక్‌ మిస్సయ్యాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ ఎనిమిదో ఓవర్‌లో.. టోనీ డి జార్జి(28) వికెట్ కీపర్ రాహుల్ చేతికి చిక్కాడు. దీని తర్వాత 10వ ఓవర్ చివరి బంతికి హెన్రిచ్ క్లాసెన్‌(6)ను అర్ష్‌దీప్ బౌల్డ్ చేశాడు. అవేష్ ఖాన్ కూడా 11వ ఓవర్లో హ్యాట్రిక్ మిస్సయ్యాడు. తొలి రెండు బంతుల్లో ఐడెన్‌ మార్క్‌రామ్‌(12), వియాన్‌ ముల్డర్‌(0)లను పెవిలియన్‌కు పంపాడు. అయితే మూడో బంతికి ఆండిలె ఫెహ్లుక్వాయో(33) డిఫెండ్ చేసి వికెట్‌ను కాపాడుకున్నాడు. 13 ఓవర్లో డేవిడ్ మిల్లర్(2) ను అవేష్ ఖాన్ అవుట్ చేసాడు. ఆ త‌ర్వాత‌ కేశవ్ మహారాజ్(4), నండ్రే బ‌ర్గ‌ర్‌(7), షంషీ(11) కూడా త‌క్కువ స్కోరుకే అవుట‌వ‌డంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్సు 27.3 ఓవర్లలో 116 పరుగుల వ‌ద్ద ముగిసింది. టీమిండియా తరఫున అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు ప‌డ‌గొట్టగా.. అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు నేల‌కూల్చాడు. కుల్‌దీప్ యాద‌వ్‌కు ఒక వికెట్ ద‌క్కింది.

Next Story