అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ, అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆటగాడిపైకి లేదా అతని సమీపంలోకి అనుచితమైన మరియు ప్రమాదకరమైన రీతిలో బంతిని విసిరినట్లు అర్ష్దీప్పై అభియోగాలు నమోదయ్యాయి. ఇది ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.9 కింద నేరమని, అందుకే ఈ జరిమానా విధించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ష్దీప్ తన తప్పును అంగీకరించడంతో ఎటువంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఒకవైపు ఫైనల్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు, ఈ జరిమానా రూపంలో చిన్నపాటి చేదు అనుభవం ఎదురైంది.